బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవ దేహానికి నివాళులర్పించారు.  అంత గొప్ప నటి, దర్శకురాలు కన్నుమూడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు.  నేడు కూడా ఆమె పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. 

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సీనియర్‌ నటుడు కృష్ణ నివాసానికి చేరుకుని విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు.

కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య మరణంతో కన్నీమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను ఓదార్చారు. జగన్‌ వెంట , ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. కడసారి చూపు కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి తరలివస్తున్నారు. 

విజయనిర్మల భౌతికకాయానికి అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరులో జరగనున్నాయి. చిలుకూరులో ఉన్న ఫాంహౌస్‌ విజయకృష్ణ గార్డెన్ లో విజయనిర్మల అంత్యక్రియలు జరుగనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: