మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను రాజధాని  ప్రాంతం నుంచి కదలనివ్వం  అంటున్నారు  ఆ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు.   కరకట్ట పై ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న వేళ చంద్ర బాబు  మరో నివాసం వెదుక్కుంటున్నారు. 

 

 ఈ నేపథ్యంలో కొందరు రైతులు చంద్రబాబు నివాసానికి వచ్చారు.రాజధాని ప్రాంతం నుంచి వెళ్ళిపో వద్దని చంద్రబాబుకు సూచించారు.  ఇంకా ఏమన్నారంటే....

 

" చంద్రబాబు ఉండటానికి అవసరమైన స్థలాన్ని మేము ఉచితంగా రాజధాని ప్రాంతంలో ఇచ్చేందుకు   సిద్ధంగా ఉన్నాం.మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మాకు అండ కోల్పోతం.. రాజధాని ప్రాంత సమస్యల్ని  అసెంబ్లీలో పోరాడటానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని వేస్తే బాగుంటుంది..

 

బాబు కు మద్దతుగా 29గ్రామా ల రైతులు వచ్చాం. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఉంటేనే మాకు ధైర్యం, అండగా ఉంటుంది. చంద్రబాబు ను రాజధాని ప్రాంతం నుంచి ఎక్కడికీ వెళ్లనీయం.

 

కొత్త ప్రభుత్వం వచ్చి నెలరోజులు దాటింది. నిర్మాణాలన్నీ ఆపేశారు. మా భవిష్యత్తు పై అభద్రత నెలకొంది. కౌలు చెక్కులు కూడా కొత్త ప్రభుత్వం ఇవ్వటం లేదు. అవసరమైతే చంద్రబాబు ఉండేందుకు మా ఇళ్ళు ఇస్తాo తప్ప ఇక్కడ నుంచి కదలనివ్వం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: