సాధారణంగా రాజకీయాల్లో ఉన్న నాయకుల కుమారులు, కుమార్తెలే కాదు.. వారి బంధువులు కూడా నిత్యం మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలోనో.. వివాదంలోనో వారి పేరు మనకు వినిపిస్తుంది. అనేక దందాలు, వసూళ్ల లో ఇప్పుడు మనకు వారసుల పేర్లు తరచుగామీడియాలో వస్తున్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, అందరి వారసులు ఇలానే ఉంటారా? అంటే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కుమార్తెలను చూస్తే.. కాదని అంటున్నారు పరిశీలకులు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఏకంగా తమతండ్రే సీఎంగా ఉన్నా కూడా జగన్ ఇద్దరు కుమార్తెలు కూడా సింప్లిసిటీకి కేరాఫ్గా మారారు. జగన్కు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే. ఒకరు వర్ష, రెండు హర్ష. ఇద్దరూకూడా చదువుల్లో దూసుకుపోతు న్నారు. పెద్ద కుమార్తె ఏకంగా ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాయించుకుని తండ్రి పేరును నిలబెట్టింది. ఇక, హర్షారెడ్డి కూడా చదువులో దూకుడుగానే ఉన్నారు.
అయితే, వీరిద్దరూ ఎప్పుడూ కూడా మీడియాకు కనిపించడం కానీ, మీడియా ముందుకు రావడం కానీ, హల్చల్ చేయడం కానీ ఎక్కడా మనకు కనిపించదు. సొంత మీడియా సాక్షిని ఉంచుకుని కూడా ఏనాడూ.. పబ్లిసిటీని కోరుకోలేదు. వాస్తవానికి మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు, మనవడు కూడా ఆయన అధికారంలో ఉండగా మనకు నిత్యం కనిపించారు. ఎక్కడికి వెళ్లినా, వారు ఏం చేస్తున్నా.. మీడియా వారిని ఫాలో చేసింది. కానీ, జగన్ కుమార్తెల విషయం మాత్రం ఇలా కాదు.
జగన్ శ్వాస మొత్తం రాజకీయాలే అయినా పిల్లలకు ఆ వాసన కూడా తెలియకుండా పెంచుతున్నారు. ఒక కూతురు వర్షరెడ్డి ఇంతకాలం లండన్ స్కూల్లో ఎకనమిక్స్ చదివారు. ఇపుడు అక్కడ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని యుఎస్ కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వీసా ప్రాసెస్ కోసం వచ్చారు వర్షరెడ్డి. ఆమెతో పాటు సోదరి హర్షిణి తల్లి వైఎస్ భారతి కూడా ఉన్నారు. యుఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా వారితో ఫొటో దిగి వర్షకు గుడ్ లక్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.