ఓటమిని జీర్ణించుకోలేని తెలుగు దేశం పార్టీ నాయకులు అధికార పక్షాన్ని రోజుకో విధంగా విమర్శిస్తున్నారు,కేవలం అధికార దుర్వినియోగం మాత్రమే తెలిసిన వాళ్ళు అధికారం లోకి వచ్చారని, ఆంద్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

తనపై జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలకు భయపడే వాణ్ణి కాదని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు,ఉండవల్లిలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, గత అయిదు వారాలుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు బాధాకరమని అన్నారు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ తెబ్బతింటుంటే తను రాష్ట్రానికి చేసిన సేవలు బూడిద పాలు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల కోసం మాట్లాడాల్సిన ప్రతిపక్షం పార్టీ కోసం మాట్లాడటం ఏంటని ప్రజలకి అర్థం కావడం లేదు.ఇలాగే కొనసాగితే మరో 5 సంవత్సరాల్లో ఏపీ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: