ఏపీలో టీడీపీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలోని నేతలు ఏ పార్టీలోకి పోవాలని అంతు చిక్కడం లేదు. అధికార పార్టీ అయిన వైస్సార్సీపీ ఎలాగూ చేర్చుకోదు. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టుకట్టాలని వారు అనుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో పలువురు ఇప్పటికే సంప్రదింపుల అంకంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. ఇక చేరికలే తరువాయి అని వారు అనుకుంటున్నారట.


అయితే బీజేపీలో చేరితే తమవెంట క్యాడర్‌ ఎంతవరకూ వస్తుంది? అనేది మాత్రం వారికే అంతుబట్టని అంశంగా మారింది. వ్యక్తిగతంగా రాజకీయంగా బలం ఉన్నవాళ్లు తమ అనుచరవర్గాన్ని అయితే తీసుకెళ్లిపోగలరు. అయితే తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు పరిస్థితి ఏమిటి? అనేది వారికే అంతుబట్టని అంశం అవుతోంది. రాయలసీమ ప్రాంతంలో బీజేపీ ఎంత కసరత్తు చేసినా, ఆ పార్టీ గుర్తు ఏదో కూడా అక్కడి సామాన్యుల్లో చాలామందికి తెలియదు.


అలాంటి పార్టీలోకి ఈ నేతలు వెళితే ఆ పార్టీకి గంపగుత్తగా ఓట్లుపడే ముచ్చట్లు ఏమీ ఉండవు. వీళ్లు వెళితే వెళ్లొచ్చు. అలా వెళితే వీరు అవకాశవాదులు అనిపించుకుంటారు. అలాంటి ముద్రను వేయించుకుంటారు. తమతో పాటు కొంతవరకూ అనుచరవర్గాన్ని బీజేపీలోకి తీసుకెళ్తారు. అంత మాత్రానా బీజేపీకి ఒరిగేది ఏమీలేదు. పేరుకు అయితే కొంతమంది నేతలుగా చలామణి అవుతారు. అలాగని వారికి నియోజకవర్గాల్లో సూపర్‌ పవర్స్‌ ఏమీరావు. బీజేపీలోకి చేరగానే వారు అధికారం చలాయించేది ఏమీ ఉండదు కూడా. తెలుగుదేశం అంటేనే కాస్తో కూస్తో విలువ ఉంటుంది ద్వితీయశ్రేణి నాయకత్వానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: