రాష్ట్ర భాగ్యవిధాత కావాలనుకునే వ్యక్తి అధికార పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందో వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా చేసి చూపిన నెల రోజుల పాలన చూస్తే అర్ధమౌతుందని చెప్పవచ్చు. మే 30న వైఎస్ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇప్పటికి ఒక నెల రోజులు పూర్తయ్యాయి. 


జగన్ నెల రోజుల పాలనలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. 


రాజకీయంగా:

Image result for jagan one month rule

*సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు  ఐదు డిప్యూటీ సీఎంల నియామకంతో దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు.
*రెండున్నరేళ్ల తర్వాత రెండో సారి మంత్రి మండల్లిలో మార్పులు చేర్పులూ ఉంటాయని చెప్పి సంచలనం తెరతీశారు. 
*నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పిన జగన్, వలసలను ప్రోత్సహించబోమని ప్రకటించి అందరి ప్రశంసలు పొందారు. 
*అన్నదమ్ములు ఐఖ్యంగా ఉంటేనే బలం. ఈ దిశలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో కలసి రాష్ట్ర విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 


మానవ వనరుల పరంగా:

*నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. గ్రామాల్లో ఉండే యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అలాగే గ్రామ పంచాయతీల ఏర్పాటు కూడా జగన్ నిర్ణయాల్లో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. 
*పోలీసులకు “వీక్లీ ఆఫ్” ఇచ్చి మరో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.  


సంక్షేమాల పరంగా:

Image result for jagan one month rule

*ఉగాది కానుకగా అర్హులైన మహిళలకు 25 లక్షల ఇంటి పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 
*జగన్ ప్రమాణ స్వీకారం రోజు పెన్షన్ పెంపు మీద తొలి సంతకం చేశారు. ₹2000/- పింఛన్‌ ను ₹2250/- కి పెంచారు. దీన్ని ప్రతి ఏటా పెంచుతూ ₹3000/- కు తీసుకెళ్తారు. 


విద్యకు అత్యధిక ప్రాధాన్యం: 

amma vodi pathakam కోసం చిత్ర ఫలితం

*అమ్మఒడి పథకం పిల్లలను స్కూల్‌కు పంపించే ప్రతి తల్లికీ ఏడాదికి ₹15000/- ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది.  
ఇటీవలే ఈ పథకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు. చదువుకు జగన్ ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో ఈ పథకం తెలియజేస్తోంది. ఇది జనవరి 26 నుంచి అమలులోకి వస్తుంది. విద్యావ్యవస్థ ప్రక్షాళనకు కూడా తగిన ప్రణాళికలు రచిస్తుంది. 


అక్రమాలపై తొలివేటు ప్రభుత్వ నిర్మాణం పైనే: 

Image result for prajavedika kulchiveta

*గత ప్రభుత్వపు అవినీతిపై జగన్ ఉక్కుపాదం మోపారు. కేబినెట్ సబ్ కమిటీని నియమించి దానితో 30 అంశాలపై విచారణ జరుపనుంది. 
*గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన "ప్రజావేదిక" అక్రమ నిర్మాణం కూల్చేసి పెద్ద సంచలనానికి తెర తీశారు.  అవినీతి ఏ స్థాయిలో ఉన్నా కూడా సహించేది లేదని హెచ్చరించారు. 
*ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆన్‌-లైన్‌లో ఇసుక విధానానికి శ్రీకారం చుట్టారు. 


వ్యవసాయదారుల ప్రయోజనాలు కాపాడే లక్ష్యం:

*రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులకు ₹12500/- ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. 
*రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. 
*₹3000/- కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు. 


వైద్య ఆరోగ్య ప్రయోజనాలకు పెద్ద పీట: 

*మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ నెలకు ₹10,000/- కు పెంచారు. 
*ఆశావర్కర్ల జీతాలు ₹3000/- నుంచి ₹10000/- లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
*అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికుల జీతాల పెంపునకు ఆమోదముద్ర వేశారు.  


రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ & అభివృద్ధి:

*రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా ప్రాధాన్యతను కేంద్రానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే వస్తున్నారు. 
*రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అధికారుల స్థాయిలో అందుబాటులో ఉన్న మార్గాల అన్వేషణ మొదలైంది .

వైఎస్ జగన్మోహనరెడ్డి నెల పాలన హిట్టా? ఫట్టా?  జగన్మోహనరెడ్డి పనితీరు ఎలా ఉంది? అటువంటి అంశాలను కేవలం నెల పాలన ప్రాతిపదికన చెప్పడం కుదరదు. 

60 నెలల పదవీకాలానికి నెల ఒక యూనిట్ గా లేదా ప్రామాణికంగా తీసుకుని రేటింగులు యివ్వటం సరైన విషయం కాదు.  కాని ప్రారంభం భవితకు మార్గదర్శనం అందుకు మాత్రం జగన్ ప్రభుత్వం సరైన అడుగే వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: