తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఇపుడు మళ్ళీ నందమూరి పాత్ర పెరుగుతోందా. దారుణమైన పరాజయం తరువాత నారా ఫ్యామిలీ వెనక్కు వెళ్తుందా. ఇప్పటికే కూసాలు కదిలిపోతున్న టీడీపీని ఆదుకునేందుకు వెండితెర సూపర్ స్టార్ జూనియర్ ఒకే అంటారా.


దీనికి సంబంధించి తెర వెనక జరుగుతున్న  ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. జూనియర్ ఎన్టీయార్ టీడీపీని కాపాడేందుకు అభయం ఇచ్చాడట. కానీ నారా లోకేష్ ని మాత్రం పార్టీలో కీలకంగా ఉంచొద్దని షరతు పెట్టాడని టాక్ వినిపిస్తోంది. ఆ ప్లేస్ లో నందమూరి బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయమని ప్రతిపాదించాడుట.


అలా చేస్తే తన మద్దతు టీడీపీకి ఉంటుందని చెప్పుకొచ్చాడట. నందమూరి ఫ్యామిలీకి చెందిన బ్రాహ్మణి ఉంటే పార్టీకి మళ్ళీ ఆ కుటుంబం సహాయం ఉంటుందన్నది జూనియర్ ఆలోచన. ఐతే దీన్ని చంద్రబాబు ద్రుష్టికి తీసుకెళ్ళినపుడు ఆయన నో అంటూ తోసిపుచ్చాడట. తన వారసుడు లోకేష్ తప్ప బ్రాహ్మణి కాదని బాబు అన్నారట. 


ఓ విధంగా నందమూరి ఆధిపత్యాన్ని పార్టీలో చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోవడంలేదంటున్నారు. అదే జరిగితే జూనియర్ ఎన్టీయార్ టీడీపీకి తన మద్దతు ఉండదని క్లారిటీగా  చెప్పేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మామా, అల్లుళ్ళు అదే బాబు జూనియర్ల మధ్య‌ టీడీపీలో ఇండైరెక్ట్ ఫైట్ స్టార్ట్ అయిందని అంటున్నారు. జూనియర్ ఈ టైంలో గట్టిగా బిగిస్తే బాబుకు పార్టీలో పట్టు పోవడం ఖాయమని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: