ఎన్నికల్లో జగన్ ఘన విజయాన్ని నమోదు చేసి సీఎం అయిపోయి తనదైన మార్క్ పాలనను చూపిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక కిందా మిందా పడుతుంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ కార్యకర్తలపై గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయని... హత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే గళం విప్పుతున్న ఆ పార్టీ ఇక దీన్ని మరింత వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిర్ణయించుకుందట.


వైసీపీ దాడుల్లో ప్రాణాలు ఆస్తులు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలనే కాకుండా తీవ్రంగా గాయపడిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చేందుకు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారని.. ఓదార్పు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు.. ఎవరెవరిపై దాడులు జరిగాయో… సమాచారం సేకరిస్తోంది. ఇప్పటి వరకూ 150కిపైగా దాడులు జరిగాయని.. ఆస్తుల విధ్వసం… హత్యలు కూడా చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.


వీరందర్నీ పరామర్శించడానికి చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారట. ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా నిర్వహించాలి మళ్లీ పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం ఎలా నింపాలన్నది ఆలోచిస్తున్నారట. ఓదార్పు యాత్ర తరువాత వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమం అందుతుండడం నిజమా కాదా అన్నది తేల్చేందుకు... అందడం లేదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు బస్సు యాత్ర నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఒకటి సీనియర్ల నుంచి వచ్చినట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే అచ్చంగా జగన్ వ్యూహాన్నే చంద్రబాబు అనుసరిస్తున్నట్లుగా లేదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: