విత్తన కొరతపై పూర్తి బాధ్యత చంద్రబాబుదే అని అన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుర్కొం టున్న ఇబ్బందులకు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణమని ఆరోపణలు చేశారు. రైతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహ రించిందని, ఏపీ సీడ్స్ కు రూ.380కోట్లు దారి మల్లించడమే ప్రధాన కారణమని ఆరోపించారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో వ్యవశాయ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడుకు దొంగిలించిన డబ్బుల్లో కనీసం రూ.108 కోట్లు అయినా విడుదల చేయాలని లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. ఆ రాసిన లేఖలను ఇప్పుడు విడుదల చేశారు. నిధులు విడుదల చేయకపోతే విత్తనాలు కొనలేమని స్పష్టం చేసినప్పటికీ కనీసం స్పందించలేదని చెప్పారు. రైతులందరికీ విత్తనాలు కచ్చితంగా సరఫరా చేస్తామని, 3.8లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేస్తామని తెలిపారు. 


ఇంకా వరి, వేరుశనగ విత్తనాల పంపిణీ చేయాల్సి ఉందని ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ, బరోడాల నుంచి విత్తనాల సేకరణ చేస్తున్నట్లు, అత్యధిక ధరకు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ నెలలోనే విత్తనాల కొనుగోలుకు చర్యలు చేపడతామని మే నెలలోనే పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.


కాగా జూన్ 8 వ తేదీ వరకు తానే ముఖ్యమంత్రి అని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఎందుకు విత్తనాల కొనుగోలుపై దృష్టి సారించలేదో చెప్పాలని నిలదీశారు. జూన్ 8 వరకు విత్తనాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నా ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. చేసిన తప్పులు చేసి తమకు చేతకాదని వ్యాఖ్యానించడం చంద్రబాబు నాయుడుకు మంచిదికదన్నారు మంత్రి కురసాల కన్నబాబు.. త్వరలోనే చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు, అరాచకాలు బయటకు వస్తాయని చంద్రబాబుని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: