ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కొందరు మంత్రులు భేఖాతరు చేస్తున్నారు . గత ప్రభుత్వ హయాం లో మంత్రుల వద్ద పనిచేసిన పనిచేసిన వారిని పేషీల్లోకి తీసుకోవద్దంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే . కానీ కొంతమంది మంతులు మాత్రం గత ప్రభుత్వ హయాం లో మంత్రుల వద్ద ఓఎస్డీ , పీఏ,పీఎస్ లు గా పని చేసిన వారంటేనే మక్కువ చూపిస్తున్నారు. ఓఎస్డీ , పీఏ,పీఎస్ ల నియామకంలో సీఎం ఆదేశాలను కొందరు మంత్రులు భేఖాతరు చేస్తుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది .
టీడీపీ ప్రభుత్వ హయాం మంత్రుల వద్ద పనిచేసిన వారిని ఇప్పటికే పలువురు మంత్రులు తమ పేషీల్లో పెట్టుకున్నారు . గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సైతం మంత్రులు తమ వెనుక తిప్పుకోవడం విమర్శలకు దారి తీస్తోంది . అవినీతి రహిత పరిపాలనే లక్ష్యమని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతుంటే , మరొక వైపు మంత్రులు గత ప్రభుత్వ హయాం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని తమ వెనుక తిప్పుకోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి .
గత ప్రభుత్వ హయాం లో మంత్రుల వద్ద పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మంత్రులు బేఖాతరు చేయడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది . గత ప్రభుత్వ హయాం మంత్రుల వద్ద పని చేసిన వారినే నియమించుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన , మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకంపై నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం .