తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొత్తరకంగా పోరాటం మొదలుపెట్టింది. ఇన్ని రోజులూ జగన్ మోహన్ రెడ్డి అవినీతి గురించి, కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యాడని విమర్శించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు జగన్ రెడ్డి అందరినీ కొనేస్తున్నాడని ఆరోపిస్తోంది. జగన్ నేషనల్ మీడియాను కొనేశాడని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు జగన్ కొన్న వారి జాబితా అంటూ కొంతమంది పేర్లను ప్రస్తావిస్తోంది. 

 తాజాగా ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి మాట్లాడుతూ.. 'అక్రమాస్తుల కేసులో బెయిల్ కోసం రాంజెఠ్మలానీ, ముకుల్ రోహత్గి, సుశీల్‌కు మార్ వంటి న్యాయవాదులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి న్యాయవాదులుగా పెట్టుకున్నావు. ఒక్కో న్యాయవాదికి రోజుకు రూ.కోటి చెల్లించావు. ఇక బెయిల్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావో చెప్పాలి...' అని వ్యాఖ్యానించాడు. జగన్ బెయిలును కూడా కొనుక్కొన్నాడని తెలుగుదేశం నేత ఆరోపించడం విశేషం. 

 ఇదతా ఇలా ఉంటే.. జగన్ విడుదల సమయంలో ఆయన ఫ్యాన్స్ కాల్చిన టపాసులను కూడా తెలుగుదేశం వాళ్లు ప్రస్తావించడం విశేషం. జగన్ బెయిల్ పై విడుదల సమయంలో జరిగిన హంగామాను కూడా తెలుగుదేశం వాళ్లు విమర్శించారు. జగన్ అనుచరులు ప్రతీ సెగ్మెంట్‌లో రూ.5 లక్షల విలువైన టపాసులు తగలబెట్టారు. అని తెలుగుదేశం ఆరోపించడం విశేషం. అయితే టపాసుల గురించి కూడా లెక్కలు  చెప్పడం మరీ అతిగా లేదూ? 


మరింత సమాచారం తెలుసుకోండి: