ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం రాజకీయాలు రోజురోజుకి అటు ప్రజల్ని ఇటు ప్రభుత్వాన్ని విసిగిస్తున్నాయి. అధికారంలో ఉండి చేతలు చేయడం చేతకాదు కానీ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ఆరోపించడం మాత్రం తెలుసు అని వైస్సార్సీపీ నాయకులు అంటున్నారు.
ఇటీవల ప్రజావేదిక కూల్చివేతను అదేదో తాజ్ మహల్ ను కూల్చి నట్టు టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని, అవినీతి కట్టడానికి ఇంత హంగామ ఎందుకని ఆరోపించారు.ఇదివరకు నేరుగా విమర్శించుకునే నాయకులు ఇప్పుడు విమర్శలను ట్వీట్ల రూపంలో చేస్తున్నారు.
వైస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ని అక్రమ సాయి రెడ్డి అని ట్వీట్ చేశారు ఆ పార్టీ లీడర్ దివ్యవాని.ప్రజలు ఛీ కొట్టినా తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు మారలేదాని కేవలం మా పరిపాలన చూసి వెన్నులో వణుకు పుట్టి ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని
బెజవాడ వైస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ దివ్యవాని ని విమర్శించింది.ఒకవైపు ఖరీఫ్ నెల ప్రారంభమైన ఇంతవరకు రైతులకు విత్తనాలు,ఎరువులు ఇవ్వలేదు ఆ విషయాన్ని పక్కన బెట్టి,ప్రధాన పార్టీ లు రెండు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం చేస్తున్నారు.మరోవైపు జగన్ పరిపాలనలో రాష్ట్రం అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: