'మీ కోసం' పేరుతో 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను కార్యాలయాలకు వెళ్లకుండా దీని ద్వారా అందజేయడానికి చంద్రబాబు దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం వెబ్‌సైట్‌ ‘స్పందన’ పేరిట కొత్తరూపు సంతరించుకోనుంది.

 

ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రతి సోమవారం స్పందన పేరుతో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కార తేదీలను కూడా నిర్దేశించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టరేట్లతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీనిని అమలుచేయాలని పేర్కొన్నారు.

 

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను స్వీకరించేందుకు వీలుగా మీకోసం వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతున్నారు. ‘స్పందన- ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ పేరిట ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించనున్నారు. దీనికి 24 గంటలపాటు పనిచేసే కాల్‌సెంటర్‌ను అనుసంధానం చేయనున్నారు. స్పందన కోసం కొత్తగా 1800-425-4440 టోల్‌ ఫ్రీ నంబరు, spandana.ap@gmail.com మెయిల్‌ను కేటాయించారు. ఈ రెండూ మరో వారం, పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

 

ఈ పోర్టల్‌లో తమ ఆధార్‌ నెంబర్‌ జత చేసి ఫిర్యాదు చేస్తుండేవారు. సలహాలు ఇవ్వడానికి, ప్రభుత్వ పథకాలు, పనులు ఎలా జరుగుతున్నాయో తెలియజేయడానికి ఆధార్‌. ప్రజలు వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయగానే ‘మీ ఫిర్యాదు అందినది’ అని మొబైల్స్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఆ ఫిర్యాదు లేదా సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా అధికారులు ముందే చెబుతారు. చెప్పిన సమయానికి పరిష్కారం కాకపోతే మళ్లీ ఫిర్యాదు చేస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: