ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అసెంబ్లీ వ్యవహారాలు, బడ్జెట్ పరిశీలన, వాటిని అర్థం చేసుకోవడంపై సదస్సులో వివరిస్తారు.
ఉదయం 10 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీలో కమిటీ హాలు-1లో ఈ సదస్సు మొలైంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ హెడ్ చక్షూ రాయ్, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ప్రసంగించనున్నారు.
స్తుత అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన సభ్యులు 100మందికి పైగా ఉన్నారని, వారందరికీ సభా నియమాలు, హక్కులు, బాధ్యతలు, సంప్రదాయాలపై వివిధ రంగాల నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామని స్పీకర్ తమ్మినేని అన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ చక్కని వేదికన్న ఆయన, శాసనసభ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
శాసనసభ పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం కలిగేలా చేస్తామని పేర్కొన్నారు. నేటితరం ఎమ్మెల్యేలు అనే అంశంపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ శిక్షణా కార్యక్రమంలో ఉపన్యసిస్తారు. తదుపరి ఒకరి తరువాత ఒకరు వరుసగా సభలో వారి అభిప్రాయాలను నిక్కచ్చిగా ఉపన్యసించవలసి ఉంటుందని తెలిపారు.