ఏపీలో అధికారం చేతులు మారింది. ప్రభుత్వ పదవులు ఇపుడు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికి మంత్రులు వరకూ పదవుల పందేరం కానిచ్చిన జగన్ ఇకపై నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. దాని కోసం ఆశావహులు పెద్ద ఎత్తున కాచుకుని కూర్చున్నారు.


ఇదిలా ఉండాగా ముందే హామీ ఇచ్చినట్లుగా  ఫైర్  బ్రాండ్ రోజాకు ఏపీఐ ఐసీ చైర్మన్  పదవి ఖాయం చేశారని తెలుస్తోంది.  ఇక ప్రతిష్టాత్మకమైన ఏపీ ఫిల్మ్ కారోరేషన్ చైర్మన్ పదవిని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. మహిళా కమిషన్  చైర్మన్ గా వాసిరెడ్డి పద్మ, సీఆర్డీయే చైర్మన్ గా ఆళ్ల రామక్రిష్ణారెడ్డిలకు కూడా పదవులు ఖాయమని అంటున్నారు.


అదే విధంగా ఆర్టీసీ  చైర్మన్ గా అంబటి రాంబాబు, కాపు కార్పోరేషన్ చైర్మన్ గా గ్రంధి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా ద్రోణం రాజు శ్రీనివాస్, సివిల్ సప్లయిస్ కమిషన్ చైర్మన్ గా ఆమంచి క్రిష్ణ మోహన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా మహ్మద్ ముస్తాఫా లను జగన్ ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి అధికారిక జాబితా ఎపుడు ప్రకటిస్తారో.



మరింత సమాచారం తెలుసుకోండి: