తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడానికి రెడీ అవుతున్నది. తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నేతలు బీజేపీలో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నారు.
ముందుగా బీజేపీ అనంతపురం జిల్లాపై దృష్టి సారించింది. ఆ జిల్లాకు చెందిన పలువురు ద్వితీయశ్రేణి నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. జెసి కుటుంబం కూడా బీజేపీలో జాయిన్ కావడానికి రెడీ గా ఉన్నట్టు సమాచారం. జేసి బ్రదర్స్ రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నారని చెప్పినా.. లోపల మాత్రం బీజేపీలో జాయిన్ కావడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
మరోవైపు పరిటాల ఫ్యామిలీ కూడా బీజేపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. తమి లేకుండా గెలుస్తూ వచ్చిన పరిటాల ఫ్యామిలీ.. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. తెలుగు దేశం పార్టీ సీటు ఆలస్యం చేయడం వలనే ఓటమి పాలైనట్టు పరిటాల కుటుంబం ఆరోపించింది.
టిడిపిలోనే ఉంటె మనుగడ కష్టం అని భావించిన పరిటాల ఫ్యామిలీ... పార్టీ మారేందుకు సిద్ధం అయ్యింది. ఒకరితరువాత ఒకరిగా బీజేపీ తీర్ధం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. పచ్చపార్టీకి అడ్డాగా ఉన్న అనంతపురం జిల్లా క్రమంగా కాషాయం రంగులోకి మారిపోతున్నట్టు తెలుస్తోంది.