గత కొంత కాలంగా నగరంలో గన్ కల్చర్ బాగానే పెరిగిపోయింది.  తమ రక్షణ కోసం అని కొందరు అంటున్నా..కొంత మంది మాత్రం అక్రమ ఆయుధాలు తమ వద్ద ఉంచుకొని బెదిరింపులకు పాల్పపతున్నారు.  లైసెన్స్ లేని ఆయుధాలు ధరించి అరాచకాలు సృష్టిస్తున్నారు.  తాజాగా  ఓఆర్ఆర్ పై గన్ తో కాల్చుకుని అశ్విన్ జైన్ అనే వ్యక్తి మృతి.


బీఎం డబ్ల్యూ కారులో వచ్చి గన్ తో కాల్చుకున్న అశ్విన్ జైన్. వైట్ కలర్ బీఎండబ్ల్యూ కారులో వచ్చి కాల్చుకున్న అశ్విన్ జైన్. నార్సింగ్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే అశ్విన్ జైన్ బంగారం వ్యాపారం చేస్తుంటారని..మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. 


ఈ ఘటన కొద్ది సేపటి క్రితమే జరిగింది కనుక పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  అయితే ఇది ఆత్మహత్యా..లేక అతనిపై ఎవరైనా కాల్పులు జరిపారా అన్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: