టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్‌లో విజృంభించేస్తున్నారు. పాపం.. ఎన్నికల్లో ఓటమి తర్వాత బయట ముఖం చూపించేందుకు పెద్దగా ఇష్టపడని ఈ యువ నాయకుడు ట్విట్టర్లో మాత్రం ఉదయం, సాయంత్రం జగన్ సర్కారును విమర్శిస్తూ తెగ పోస్టులు పెడుతున్నారు.


తాజాగా.. జగన్ గారూ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు అంటూ అర్బన్ హౌజింగ్ లో అక్రమాలు జరిగాయని మొన్న జగన్ చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజాధనం మింగి రాజాలా మీరు రాజ భవనాల్లో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. మీరు ఉండటానికి హైదరాబాద్ లో పాండ్ మింగి లోటస్ లాంటి భవనం నిర్మించుకోవచ్చు అంటూ కౌంటర్ వేశారు.


సరదాగా కొంత సమయం గడపడానికి బెంగుళూరులో ప్యాలస్ నిర్మించుకోవచ్చు. అమరావతిలో నివాసం కోసం రాజ భవంతి కట్టుకోవచ్చు పేదవాడు మాత్రం ఎప్పుడూ కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలొనే ఉండిపోవాలి... అంటూ పోస్టు పెట్టారు.


ప్రజాధనంతో పేదవాడికి అన్ని సౌకర్యాలు ఉన్న ఎన్టీఆర్ ఇళ్లు కట్టడం తప్పు అని మీరు అనడం సబబు కాదు జగన్ గారు. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇకనైనా సాక్షి పేపర్ చదవడం మాని, పక్కన ఉన్న అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. అది కూడా ఇష్టం లేదు అంటే ఇవిగో కొన్ని వివరాలు..అంటూ కొన్ని డాక్యుమెంట్లను తన పోస్టుకు ఎటాచ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ చిన్న దొరవారు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదో..


మరింత సమాచారం తెలుసుకోండి: