ఇకపై ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయం
• ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశం
• అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశం
• సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం
• ఇసుక రీచ్ల వద్ద స్టాక్యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు
• ఇసుకరీచ్ నుంచి స్టాక్యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు
• రీచ్లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు
• స్టాక్యార్డునుంచి వినియోగదారుడుకు చేరేంతవరకూ మరొక రశీదు
• స్టాక్యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, ఇసుక బయటకు వెళ్లేటప్పుడుకూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు
• రీచ్లవద్ద, స్టాక్యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు
• ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి
• మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు
• ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు - వీరిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశం
• రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాల గుర్తింపు, వాటికి జీపీఎస్ అమరిక, ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్యార్డుల ఏర్పాటు పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి
• ఇసుక వినియోగ దారులకోసం ఒక యాప్, వెబ్ పోర్టల్ను తయారుచేయనున్న ఏపీఎండీసీ
• కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కొనసాగించనున్న కలెక్టర్లు
• రెండునెలల్లోగా అదనపు రీచ్లను గుర్తింపు, డిమాండ్కు తగినట్టుగా ఇసుకను అందించనున్న ఎన్ఎండీసీ
• ప్రభుత్వానికి, వినియోగదారుడుకు పరస్పరం మేలు జరిగేలా ధరను నిర్ణయించనున్న గనులశాఖ
• కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను ఏర్పాటు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి