దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గాని... నేడు ఏపీ సీఎం.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గాని ఆ రెండు ప‌త్రిక‌లు చ‌ద‌వ‌మంటే చ‌ద‌వ‌మ‌ని... ఎవ్వ‌రూ చ‌ద‌వద్ద‌ని ఓపెన్‌గానే చెప్పేవారు. ఇలా ముక్కుసూటిగా చెప్ప‌డం ఈ ఇద్ద‌రికే చెల్లింది. అప్పుడు కాంగ్రెస్‌కు ఓ మీడియా ఉండాల‌నే సాక్షి పత్రిక, ఛానెల్ పెట్టారు. ఇక జ‌గ‌న్‌, వైసీపీపై ఐదేళ్ల పాటు ప‌చ్చ ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతితో పాటు ఏబీఎన్ ఛానెల్ ఎంత దుష్ప్ర‌చారం చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.


ఈనాడు కూడా టీడీపీకి స‌పోర్ట్‌గా ఉన్నా ఆ ప‌త్రిక మ‌రీ బ‌రితెగించ‌ద‌న్న అభిప్రాయం ఉంది. ఆంధ్ర‌జ్యోతి మాత్రం టీడీపీ, చంద్ర‌బాబు కోసం బ‌ట్ట‌లిప్పుకుని మ‌రీ కొర‌డాతో కొట్టేసుకుంటుంద‌న్న గుస‌గుస‌లు మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఆ రెండు ప‌త్రిక‌లు అన్నా ఈనాడు కంటే జ్యోతిపై తీవ్ర‌మైన ఆగ్ర‌హంతో ఉన్నార‌న్న‌ది కూడా తెలిసిందే. ఇక జ్యోతి ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో చాలా అక్ర‌మాలు చేసింది.


అందుకే ఇప్పుడిప్పుడే ఈ సంస్థ ఆఫీసుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు కూడా ఇస్తోంది. ఈ ప‌త్రిక విలేక‌ర్లు చేసిన అక్ర‌మాలు, దందాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా జ్యోతి ప‌త్రిక‌ను అస్స‌లు ఫాలో అవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా బ‌య‌ట‌కొచ్చిన జ‌గ‌న్ ఆఫీసులోని టేబుల్ మీద ఉన్న ప‌త్రిక‌ల్ని చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.


సీనియ‌ర్ నేత దాడి వీర‌భ‌ద్ర‌రావు జ‌గ‌న్‌ను భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో తీసిన ఫొటోలో జ‌గ‌న్ టేబుల్ మీద పెద్ద ఎత్తున దిన‌ప‌త్రిక‌లు ఉన్నాయి. వాటిల్లో  అగ్ర ప‌త్రిక‌లు మొద‌లుకొని పెద్ద‌గా ప‌రిచ‌యం లేని దిన‌ప‌త్రిక‌లు ఉన్నాయి. ఇన్ని ఉన్నా.. తాను ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక మాత్రం లేదు. దీనిని బ‌ట్టి జ‌గ‌న్ జ్యోతి ప‌త్రిక మొఖం చూసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జ‌గ‌న్‌పై ఇటీవ‌ల జ్యోతి ప‌త్రిక వార్త‌లు కాస్త మారిన‌ట్టు కూడా టాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: