వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా మరోసారి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుని గడగడలాడించిన విజయసాయి రెడ్డి, అధికారంలోకి వచ్చాక రోజుకొకలా ఆడుకుంటున్నారు. అయితే అటు టీడీపీ సైడ్ నుంచి కూడా ఏమాత్రం తగ్గడంలేదు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకునే సంచలనమైన నిర్ణయాలను, అమలు చేసే విధానాన్ని తప్పుదొవ పట్టించేందుకు సోషల్ మీడియా వేధికగా ట్విట్స్ చేసి విమర్శిసిస్తున్నారు.      


అయితే గతంలో ప్రతిపక్షనేతగా విజయసాయి రెడ్డి పెట్టె ట్విట్లు సోషల్ మీడియా వేధికగా విజయసాయి రెడ్డికి, వైసీపీకి నెటిజన్లు మద్దతు ఇస్తూ చంద్రబాబు నాయుడుని విమర్శించేవారు. విజయసాయి రెడ్డి ట్వీట్లతో తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూడా చంద్రబాబు గతంలో చేసిన పనులను విమర్శిస్తూ ట్విట్ల మీద ట్విట్లు చేస్తున్నారు. అయితే తాజాగా విజయసాయి రెడ్డి మరో సంచలన ట్విట్ చేసారు. ఆ ట్విట్ ఏంటంటే చంద్రబాబూకి సైకియాట్రిక్ పరీక్షలు గురించి.. 


విజయ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ 5 కేటగిరీలుగా విభజించింది. చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుంది. ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప, పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని(ఫోభియా)ను వ్యక్తం చేస్తుంటారాయన. అంటూ ట్విట్ చేసారు. అయితే చంద్రబాబుకు ఫోబియా ఉందని ట్విట్ చేశారు. అయితే ఈ ట్వీట్లకు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: