అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్న ఏపీ సీఎం జగన్.. మరో వర్గం ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కల్యాణ మిత్రలకు అందించే ప్రోత్సాహకం పెంచుతామని ముఖ్యమంత్రి వైఎయ‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కలసిన కల్యాణ మిత్రలకు జగన్ భరోసా ఇచ్చారు.


కల్యాణ మిత్రల ప్రతినిధులు ఎం.స్వప్న, కె.విజయదుర్గ తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. వైయ‌స్ఆర్‌ పెళ్లి కానుక కార్యక్రమానికి తమనే కల్యాణ మిత్రలుగా ఉంచాలని విన్నవించారు. తమకిచ్చే ప్రోత్సాహకం ఎంతమాత్రం సరిపోవట్లేదని వాపోయారు.


కల్యాణ మిత్రలను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం మీరే కల్యాణ మిత్రలుగా ఉండి పెళ్లిళ్లు నిర్వహిస్తారంటూ వారికి భరోసానిచ్చారు.


పగలు జరిగే పెళ్లికి ఇచ్చే రూ.250 ప్రోత్సాహకం మొత్తాన్ని రూ.500కు, రాత్రి జరిగే పెళ్లికిచ్చే మొత్తాన్ని రూ.500 నుంచి రూ.1000కి, ఫీల్డ్‌ వెరిఫికేషన్‌కు ఇచ్చే మొత్తాన్ని రూ.300 నుంచి రూ.600కి పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. జగన్ హామీతో సంతోషపడిన కల్యాణ మిత్ర ప్రతినిధులు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: