ఈ మధ్య ఎప్పుడు లేనంతగా నారా లోకేష్ ట్విట్టర్ లో సంచలనంగా మారే ట్వీట్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. దానిని పచ్చ మీడియా హైలైట్ చేయడం. తాజగా జరుగుతున్న పరిణామాలివి. అయితే మీడియా ముందుకో, ప్రజల ముందుకో వచ్చి మాట్లాడే చేవలేదని ఇప్పటికే నిరూపించుకున్న లోకేష్ పేరిట వరస పెట్టి ట్వీట్లు వేస్తూ ఉన్నారు. ఆ ట్వీట్లలో అవసరానికి మించిన ఎక్స్ ప్రెషన్లను వాడేస్తూ ఉన్నారు. బహుశా లోకేష్ ను మేధావిగా చూపించేందుకు అలాంటి పదజాలాన్ని వాడుతున్నట్టున్నారని పరిశీలకులు అంటున్నారు.


అయితే లోకేష్ కు ఆ ట్వీట్లలోని పదాలు పలకడం వచ్చు అంటే నమ్మడం కష్టం. స్వయంగా లోకేష్ ఆ ట్వీట్లను తప్పుల్లేకుండా యథాతథంగా చదవి వినిపిస్తే అప్పుడు ఆ ట్వీట్లను ఆయనే పెట్టారనే నమ్మకం అందరిలోనూ కలుగుతుంది. అయితే లోకేష్ అంత సాహసం చేయడంలేదు. అదలా ఉంటే లోకేష్ ట్వీట్ల వెనుక వేరే కథ ఉందని అంటున్నారు విజయసాయి రెడ్డి. లోకేష్ ను తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలనే వ్యూహాన్ని అమలు పెడుతూ ఉన్నారని  విజయసాయి రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


''లోకేశ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లనికాసు అయిపోయాడు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. మరి నిజంగానే లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారా?  ఎమ్మెల్యేగా ప్రజల ఆమోదం పొందని ఆయనను ఆ హోదాను ఇవ్వబోతున్నారా!



మరింత సమాచారం తెలుసుకోండి: