అదేంటో బీజేపీకి ఏపీ ఇంచార్జిలా ఆయన లేరు. చంద్రబాబుని జైలుకు పంపించే బాధ్యతను చూస్తున్నట్లుగా ఉన్నారు. ఈ పెద్దాయన ఏపీకి వచ్చినపుడల్లా చంద్రబాబును జైలుకు పంపుతామంటూ గర్జిస్తున్నారు. అసలు ఈయన సరదా ఏమిటో ఎవరికీ అర్ధం కావడంలేదుగా.
 

ఓ విధంగా  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిజెపి నేత సునీల్ ధియోధర్ పెద్ద చికాకుగా మారారు. టిడిపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఒకరోజు,చంద్రబాబు జైలుకు వెళతారని మరోరోజు వ్యాఖ్యానిస్తూ కలకలం రేపుతున్నారు.తాజాగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహ‌న్‌రెడ్డి కరకట్టపై వున్న ఇంటిని ఖాళీ చేయిస్తే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారట.


 గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేపట్టాల్సిన భాధ్యత వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. విచారణ చేసి చంద్రబాబు అవినీతిపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు అవినీతి రుజువైతే రెండు సంవత్సరాల్లోనే ఆయన జైలుకెళ్తారని ఆయన అంటున్నారు. సునీల్ ధియోదర్ చెప్పినట్లు జరుగుతుందా?


లేక చెప్పాలని చెబుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. అయినా చంద్రబబు అవినీతి మీద ఆధారాలు ఉంటే ఇన్నాళ్ళూ మోడీ మౌనంగా ఎందుకున్నట్లో. ఏపీలో జగన్ని బాబు అవినీతి బయటపెట్టాలని డిమాండ్ చేయడం ఏంటో.


మరింత సమాచారం తెలుసుకోండి: