భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బిజెపి నాయకత్వం  కన్నేసింది. జార్ఖండ్ ఎన్నికల్లో ధోనీ పాపులారిటీ పార్టీకి ఉపయోగపడుతుందని ఆ పార్టీ  నాయకత్వం భావిస్తోంది. జెఎంఎం, ఆర్జెడి, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి జార్ఖండ్ లో ధోనీ ప్రజాదరణను వాడుకోవాలని బిజెపి నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ధోనీ తమ పార్టీలో చేరడానికి ఇష్టపడకపోతే కనీసం ప్రచారానికైనా వాడుకునే విధంగా చూడాలని బిజెపి నాయకత్వం ఆలోచిస్తోంది. డిసెంబర్ లో  జార్ఖండ్ శానససభ ఎన్నికలు జరగనున్న నేపధ్యం లో,  పలువురు బిజెపి నాయకులు ధోనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


 ప్రపంచ కప్ టోర్నమెంటు తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నందున ఇప్పటి నుంచే బిజెపి నేతలు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. అయితే, ధోనీ తన రిటైర్మెంటు గురించి ఇప్పటి వరకూ  స్పష్టంగా ఏమీ చెప్పలేదు. తాను ఎప్పుడు రిటైర్ అవుతానో తనకు తెలియదని అన్నాడు. ధోనీ రిటైర్మెంటు తమకు ఉపయోగపడుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. రిటైర్మెంటు తర్వాత రాజకీయాల్లోకి రావడానికి ధోనీ ఆసక్తి చూపుతున్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే, తమ పార్టీలో చేరుతారా, లేదా అనేది ఆయనకే వదిలేస్తామని చెబుతున్నారు. సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా గత ఏడాది ఆగస్టు 5వ తేదీన బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు పియూష్ గోయల్, సరోజ్ పాండే , మనోజ్ తివారీ ధోనీ ఇంటికి వెళ్లి ఆయనను కలిసిన విషయం తెల్సిందే .


అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తరువాత పలువురు క్రికెటర్లు బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే . ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన గౌతమ్ గంభీర్ కూడా బీజేపీ లో చేరి ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించాడు . తొలుత సిద్ధూ  బీజేపీ తరుపున ఎంపీ గా ఎన్నికై అనంతరం ఆ పార్టీ నాయకత్వం తో విభేదించి కాంగ్రెస్ పార్టీ లో చేరారు  ఇక కీర్తి ఆజాద్ వంటి మాజీలు సైతం బీజేపీ తరుపున చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు . ఏ విధంగా చూసిన బీజేపీ కి , క్రికెటర్లకు ఉన్న అనుబంధాన్ని పరిశీలిస్తే ధోని కూడా కాషాయ కండువా కప్పుకుని ఛాన్సుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: