నిత్యానంద బెంగుళూరులోని బిడది ఆశ్రమ వ్యవస్థాపకుడు. ఈ రాసలీలల స్వామి ఆశ్రమానికి ఇప్పటికీ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వారి వీక్ పాయింట్ని ఆసరాగా చేసుకునే స్వామి తాజాగా వారిని బక్రా చేసేశారు. రోజూ ఆశ్రమంలో నిత్యానంద స్వామి ధ్వజారోహణ చేస్తుంటారు. తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే ధ్వజారోహణ కార్యక్రమం పూర్తవుతుంటుంది. అయితే వారం రోజుల క్రిందట ధ్వజారోహణ కాస్త ఆలస్యంగా జరిగింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. స్వామి స్పందించి సూర్యోదయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.``ధ్వజారోహణ ఆ రోజు ఆలస్యం కాలేదు.. సూర్యోదయం కాకుండా నేనే అడ్డుకున్నాను. సూర్యుడిని 40 నిమిషాల తరువాత ఉదయించమన్నాను. సూర్యుడు నా మాట విన్నాడు. ఆ రోజు ఆకాశం కూడా నిర్మలంగా ఉంది. కావాలంటే గూగుల్ డేటా చూసుకోండి`` అని స్వామీ నిత్యానంద అవాక్కయ్యే వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో నిత్యానంద స్వామి వ్యాఖ్యలు తెగ ట్రోల్ అవుతున్నాయి. సూర్యుడిని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నిత్యానంద బెంగుళూరులోని బిడది ఆశ్రమ వ్యవస్థాపకుడు. ఈ రాసలీలల స్వామి ఆశ్రమానికి ఇప్పటికీ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వారి వీక్ పాయింట్ని ఆసరాగా చేసుకునే స్వామి తాజాగా వారిని బక్రా చేసేశారు. రోజూ ఆశ్రమంలో నిత్యానంద స్వామి ధ్వజారోహణ చేస్తుంటారు. తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే ధ్వజారోహణ కార్యక్రమం పూర్తవుతుంటుంది. అయితే వారం రోజుల క్రిందట ధ్వజారోహణ కాస్త ఆలస్యంగా జరిగింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. స్వామి స్పందించి సూర్యోదయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.``ధ్వజారోహణ ఆ రోజు ఆలస్యం కాలేదు.. సూర్యోదయం కాకుండా నేనే అడ్డుకున్నాను. సూర్యుడిని 40 నిమిషాల తరువాత ఉదయించమన్నాను. సూర్యుడు నా మాట విన్నాడు. ఆ రోజు ఆకాశం కూడా నిర్మలంగా ఉంది. కావాలంటే గూగుల్ డేటా చూసుకోండి`` అని స్వామీ నిత్యానంద అవాక్కయ్యే వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో నిత్యానంద స్వామి వ్యాఖ్యలు తెగ ట్రోల్ అవుతున్నాయి. సూర్యుడిని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.