ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు సంవత్సరం ఉందనగా రాజకీయ తెరపైకి వచ్చిన సాదినేని యామిని అలియాస్ యామినీ శర్మ ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో వైసిపిని, కేంద్రంలో బీజేపీని విమర్శిస్తూ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు హడావిడి కూడా మాములుగా లేదు అనుకోండి.


ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ పక్క వస్తుంది అనుకున్న సాదినేని యామిని ఆశలపై నీళ్లు చల్లింది వైసీపీ పార్టీ. దీంతో సాదినేని యామిని గొంతు మూగబోయింది, ఓడిపోయిన సాదినేని యామిని మాములుగా సాధించుకొని తినలేదు ఇతర పార్టీ అభిమానులు. ఒకరు ఇంటిపై రాళ్ళూ వేస్తే మరొకరు సోషల్ మీడియా వేధికగా కామెంట్లు చేసి మానసికంగా హింసించారు. దీంతో ఈ మధ్య కాలంలో బయట అసలు కనిపించని యామిని ఇప్పుడు ఏకంగా సీఎంపై విమర్శలు చేస్తున్నారు. 


తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై బురద చల్లుతున్నారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైఎస్ జగన్ ఇప్పటికి చంద్రబాబుని ఎందుకు జైల్లో వెయ్యలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ 40 రోజుల్లోనే వైసీపీ జగన్ పాలనా ఎంత భయంకరంగా చేసారో అర్థమవుతుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే కేవలం నలబై రోజుల వైఎస్ జగన్ పాలనాపై టీడీపీ వారు ఆగకుండా విమర్శలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: