చంద్రబాబు ఘోర ఓటమి వల్ల ..  ఆ పార్టీ నేతల నుంచి రావాల్సిన సరైనా గౌరవం కూడా రావటం లేదు. బాబుగారి మీద ట్విట్టర్లో విజయవాడ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చివరికి చంద్రబాబునాయుడు జీవితం ఇలా అయిపోయిందా అని అనుమానం కలుగుతోంది! ఎందుకంటే... తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మంగళవారం పొద్దున్నే 6.50 నిమిషాలకే తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్టుపెట్టారు. ‘‘టీడీపీ నౌ రిక్వయిర్స్ టాస్క్ మాస్టర్స్.. నాట్ షో మాస్టర్స్’’ అని ఒకే వాక్యాన్ని ఆ పోస్టులో పెట్టారు. 

ఆ ‘షో మాస్టర్’ చంద్రబాబేనా?

తెలుగుదేశానికి ఇప్పుడు పనిచేసే మాస్టర్స్ కావాలి. షో మాస్టర్లు కాదు.. అని దాని భావం. పొద్దున నిద్రలేవగానే.. ఇలాంటి పోస్టు పెట్టాలనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది? నిద్దర్లో ఏమైనా కలగని, దాని భావాన్ని పెట్టారా అని సాధారణంగా మనకు డౌటొస్తుంది.కానీ దీనిని విశ్లేషిస్తే... ఆ కామెంట్ చంద్రబాబు మీద వెటకారం అని బోధపడుతుంది. సాధారణంగా.. ఉదయం 6.50 గంటలు అంటే... నాయకులు పేపర్ చదివే సమయం. ఇవాళ దినపత్రికల్లో చంద్రబాబునాయుడు రైతుల్ని ఓదారుస్తున్న ఫోటోలు ప్రముఖంగా వచ్చాయి.


లాఠీ చార్జి చేశారంటూ.. భోరున ఏడుస్తున్న రైతును చంద్రబాబు వాటేసుకుని ఓదార్చడం అనేది ఫోటోలోని ఘట్టం. జాగ్రత్తగా గమనిస్తే.. ఇటీవలి కాలంలో.. చంద్రబాబును కలుస్తున్న ప్రతివాళ్లూ ‘ఏడుస్తూనే’ ఉన్నారు. అందరూ ఏడుస్తున్నారో లేదో గానీ.. ఆయనను వాటేసుకుని ఏడుస్తున్న వారి ఫోటోలు మాత్రమే పేపర్లలో వస్తున్నాయి. చంద్రబాబు గెలవలేదని ఏడ్చేవాళ్లు, ఆయన మెజారిటీ తగ్గిందని ఏడ్చేవాళ్లూ, జగన్ గెలిచాడని ఏడ్చేవాళ్లూ.. ఇప్పుడు లాఠీచార్జి జరిగిందని ఏడ్చేవాళ్లూ ఇలా ఏడుపులు పలువిధములుగా కొనసాగుతున్నాయి. నిద్దర్లేవగానే మళ్లీ ఓ ఏడుపు డ్రామాను చూసేసరికి కేశినేని నానికి చిర్రెత్తుకు వచ్చినట్లుగా ఉన్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: