గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు.  ఎక్కడ చూసినా మహిళలపై లైంగికదాడులు, అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు.  చిన్నారులపై కూడా లైంగికదాడులు, అత్యాచారాలకు పాల్పపడుతూ మానస సమాజానికే మచ్చ తెచ్చుస్తున్నారు.  ఇలాంటి విశృంఖలాలకు మూలం ఈ మద్య స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా వస్తున్న ఫోర్నోగ్రఫీ అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.  తక్కవధరలో ఇంటర్ నెట్ సౌలభ్యం..విచ్చలవిడిగా ఫోర్నోగ్రఫీలు చూడటం వల్ల యుత్ పక్కదారి పడుతున్నారని వారు అంటున్నారు. 

తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం అర్ధరాత్రి ఓ యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని రాగంపేట రెల్లివీధికి చెందిన బొబ్బిలి పృథ్వి తనకు సన్నిహితంగా ఉండే 19 ఏళ్ల యువతిని శనివారం అర్ధరాత్రి జనతా గ్యారేజ్‌ (రేకుల షెడ్లు) ఏరియాకు తీసుకెళ్లాడు.  అప్పటికే ప్లాన్ ప్రకారం ఉన్న పృథ్వి స్నేహితులైన దలైయ్‌ శ్యామ్‌కుమార్‌, వాసుపల్లి సాయి, నీలాపు సాయికుమార్‌ అక్కడకు చేరుకున్నారు.

వీరంతా కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పింది. సోమవారం ఉదయం తల్లి సాయంతో త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: