గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో నేరల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ కి చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. చనిపోయిన యువతి మనస్వినిగా గుర్తించారు. 

దిల్ సుఖ్ నగర్ లాడ్జీలో యువతి గొంతు కోసిన యువకుడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువకుడు. ఆ యువకుడు నెల్లూరు కి చెందిన వెంకటేష్...అయితే అతడు హైదరాబాద్ కి ఎందుకు వచ్చాడు..ఆ యువతితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది..సోషల్ మీడియా ద్వారానా..లేదా స్నేహితుల ద్వారానా అన్న విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఇప్పటికే యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించగా..ఆసుపత్రిలో యువతి  విషమ పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: