గతంలో హైదరాబాద్ లో ఈడీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని బొల్లినేనిపై అభియోగాలు ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్ లో ఏక కాలంలో కొనసాగిన సోదాలు. 

ఇప్పటి వరకు రూ.3.75 కోట్ల ఆస్తులు గుర్తించిన సీబీఐ.  టీడీపీ అధినేత చంద్రబాబుకు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అత్యంత సన్నిహితుడు.  అధిక ఆదాయం కలిగి ఉన్నారన్న కారణంతో కేసు కూడా నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయనపై సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. బొల్లినేని నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ప్రస్తుతం జీఎస్టీ సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: