ఈ మద్య చాలా మంది డబ్బు సంపాదన కోసం దేనికైనా తెగిస్తున్నారు.  ఈజి మనీ కోసం ఎంతటి నీచమైన పనులు చేయడానికి వెనుకాడటం లేదు.  ముఖ్యంగా యువకులను టార్గెట్ చేసుకొని హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ వారి వద్ద ఉన్నదంతా లాగుస్తున్నారు.  ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటి దందాలు యధేచ్చగా సాగుతున్నాయి.  మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ ముసుగులో ఇలాంటి దందాలు కొనసాగిస్తూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. 

తాజాగా నెల్లూరులో వృభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే...  నెల్లూరులోని వేదాయపాళెంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారగృహాలపై దాడులు చేసిన పోలీసులు తొమ్మిదిమంది మహిళలకు విమక్తి కలిగించారు. ఈ క్రమంలో ఆయా నివాసాలపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం సాయంత్ర దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. 

నిర్వాహకులైన ముగ్గురు మహిళలను.. ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు.  అయితే గత కొంత కాలంగా నిర్వాహకుల చేతిలో వీరు నరకం అనుభవిస్తున్నామని కొంత మంది యువతులు మొరపెట్టుకోవడంతో  9 మంది యువతులకు పోలీసులు విముక్తి కలిగించారు. దీనికి సంబంధించిన వివరాలను నగర డీఎస్పీ మీడియాకు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: