ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఎన్నికలైనప్పటి నుంచి రాజకీయ పరిణామాలు చిత్ర విచిత్రంగా మారాయి. వైసీపీ అఖండ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీలో కదలికలు మొదలయ్యాయి.
ఇప్పటికే పలువురు ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి బీజేపీలోకి వెళ్లారు. మరికొంత మంది వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. కాగా, ఈ విషయం ఆయన సన్నిహితుల ద్వారా తెలిసిందని టాక్ వినిపిస్తుంది.
గుంటూరు జిల్లా టీడీపీలో ఆయన కీలక నేత ఉన్నారు. బాపట్ల టీడీపీలో అన్నం సతీష్ తిరుగులేని నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు.త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. యితే ఆయన ఇప్పుడు టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.