మజ్ను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మల్లు బ్యూటీ అనూ ఇమాన్యూయేల్. ఈ భామ మొదటి సినిమాతోనే నటిగా నిరూపించుకొని హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక రెండో సినిమాని రాజ్ తరుణ్ లాంటి కుర్ర హీరోతో కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమా చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన ఊహించని విధంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలకి జోడీగా అవకాశాలు అందుకుంది. ఇక టాలీవుడ్ లో గోపిచంద్, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టిన ఈ భామకి అస్సలు అదృష్టం కలిసి రాలేదు. ఇక చివరికి రవితేజ కూడా ఈ భామ అదృష్టాన్ని మార్చలేకపోయాడు.

 

దీంతో ఎంత వేగంగా తెలుగులో స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుందో అంతే వేగంగా దర్శకులు అనూ ఇమాన్యూయేల్ ని పక్కన పెట్టేసారు. గ్లామర్ ప్రదర్శనని అడ్డంకి చెప్పకపోయినా, నటిగా కూడా పర్వాలేదనే మార్క్స్ వేయించుకున్న ఈ మల్లు భామకి సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇక ఈ భామ తెలుగులో చివరిగా చైతూకి జోడీగా చేసిన శైలజారెడ్డిగారి అల్లుడు కూడా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని తనపై ఉన్న ఐరన్ లెగ్ ముద్రని కొనసాగించింది.

 

అయితే ఇప్పుడు ఈ భామకి తెలుగులో అవకాశాలు దూరం అయిన కోలీవుడ్ లో ఊహించని విధంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే విశాల్ కి జోడీగా డిటెక్టివ్ అనే సినిమాలో నటించి కోలీవుడ్ లో హిట్ కొట్టిన ఈ భామ అక్కడి దర్శకులని ఆకట్టుకోవడంతో ఓ స్టార్ హీరో చిత్రంలో అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా హిట్ అయితే ఈ భామ ఫేట్ మళ్ళీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మరి తన మీద ఉన్న ఐరన్ లెగ్ ముద్రని ఈ సినిమాతో అయిన చేరుపుకుంటుంది ఏమో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: