ఒక్క ఓటమి తెలుగుదేశం పార్టీని అతలాకుతలం చేస్తోంది. ఆ పార్టీ ఇక మనలేదని ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసి పాతికేళ్ళ బంధాన్ని తెంపుకున్నడంటేనే సైకిల్ పంక్చర్లు ఇక దాచినా దాగవని అర్ధమతుతోంది. ఇక తనతో పాటే మరింతమంది రాజీనామా బాట పడతారని కూడా ఆ ఎమ్మెల్సీ గారు చెప్పేసి షాక్ ఇచ్చారు.


ఇక ఇపుడు రాయలసీమ పెద్దాయన వంతు వచ్చింది. జేసీ దివాకరరెడ్డి సోదరుడు,  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ  ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గారికి ఒక సలహా ఇచ్చారు. బీజేపీతో టీడీపీని విలీనం చేస్తే పోలా అన్నది ఆ సలహా. ఆ విధంగా చేస్తే అందరికీ బాగుంటుందిట. 


ఇక బాబు గారి తెలివితేటలు బీజేపీకి అవసరం కూడానట. నరేంద్ర మోడీకి బాబు గారు సలహాలు ఇవ్వవచ్చు, బీజేపీలో కూడా పెద్ద పదవులు పొందవచ్చు ఇదీ. జేసీ బ్రదర్ సలహా. మరి బాబు గారికి ఈ మాట ఎలా ఉందో. పుండు మీద కారం చల్లినట్లుగా ఉందేమో. ఎందుకంటే పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఆయన. కోరి వెళ్ళి మోడీ పార్టీతో విలీనం చేస్తారా. ఈ సంగతేమో కానీ జేసీ బ్రదర్స్ తాము బీజేపీలోకి పోతున్నామని హింట్ ఇచ్చారన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: