రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు..శాశ్వత మిత్రులు ఉండరు..ఈ విషయం అందరికీ తెలిసిందే.  అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఇరు వర్గాలు మద్య మాటల యుద్దం నడిచినప్పటికీ వెలుపల మాత్రం సన్నిహితంగా పలకరింపులు ఉంటాయి.  అధికార పక్షం..ప్రతిపక్ష నేతలు హాయ్..బాయ్ లు ఉంటాయి.  తాజాగా నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అచ్చెన్నాయుడు- కొడాలి నాని మధ్య సరదా సంభాషణ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు కొడాలి నాని, అచ్చెన్నాయుడు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నాని మందలిస్తూ..‘ఏంటి నాని.. నల్లబడ్డావ్?’ అని అడిగారు. దీంతో కొడాలి నాని స్పందిస్తూ..‘జనంతో తిరుగుతున్నాం కదా... మీలా రెస్ట్ లో లేం అందుకే నల్లబడ్డా’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు.

దానికి అచ్చెన్నాయుడు కౌంటర్ గా రేషన్‌‌లో ఇస్తామన్న సన్నబియ్యం సంగతి తేలుస్తానంటూ సవాల్ విసిరారు. దానికి ప్రతిస్పందనగా.. నువ్వు ఏమీ తేల్చలేవు.. సన్నబియ్యం ఇచ్చి తీరుతానని.. అవసరమైతే నీకు సన్నబియ్యం బస్తా పంపుతానంటూ స్పష్టం చేశారు. ఇలా వీరిద్దరూ కామెడీగా మాట్లాడుకోవడం పక్కన ఉన్నవారికి నవ్వులు తెప్పించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: