జగన్ రాజకీయంగా ఆరితేరిపోయారు. ఆయన్ని చూసి నోళ్ళు వెళ్ళబెట్టడమే టీడీపీ తమ్ముళ్ల వంతు అవుతోంది. విషయంపై పూర్తి అవగాహన పెంచుకుంటూ జగన్ అసెంబ్లీ లోపలా బయటా చేస్తున్న ప్రసంగాలు విపక్షాలకు మాట రానీయకుండా చేస్తున్నాయి.


ఇదిలా ఉండగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే సినిమా చూపించారు.శాసనసభలో కరువు పై ప్రకటన చేసిన సందర్భంగా కరువు నివారణ చర్యలు తదితర అంశాలపై ఆయన మాట్లాడుతూ కొన్ని వీడియోలను కూడా అసెంబ్లీలో ప్రదర్శించారు. విత్తనాల కొనుగోలుకు అవసరమైన నిదులు ఇవ్వాలని అదికారులు కోరుతూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలను ఆయన టీవీలలో చూపించారు.


ఆ తర్వాత గతంలో రుణమాఫీకి సంబందించి చంద్రబాబు చేసిన ప్రకటన ఆ తర్వాత ఆయన మాట మార్చిన వైనానికి సంబందించిన వీడియోలను కూడా జగన్ చూపించారు.ఆ సమయంలో చంద్రబాబు కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. ఆయన కూడా వాటిని తిలకించక తప్పలేదు. మరి తాను మాట మార్చలేదని చెప్పుకుంటున్న చంద్రబాబు నిజాలుగా కళ్ళముందు కనిపిస్తున్న వాటిని చూసి ఏమనలేకపోయారు. ఆయన సైతం సినిమా చూశారంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: