కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కన్నడ, తెలుగు, హిందీ భాషలలో కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్లలో కూడా రికార్డులు సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో సినిమా మొదలుకాబోతున్నట్లు తెలుస్తుంది. 
 
టాలీవుడ్లో ఎన్టీయార్ కూడా టెంపర్ సినిమా తరువాత వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీయార్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2020 జులై 31 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబో సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ ఎన్టీయార్ కు ఎంతగానో నచ్చిందని తెలుస్తుంది.  
 
ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీయార్ నటిస్తే ఎన్టీయార్ కు ఇతర భాషల్లో కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీయార్ కు ప్రశాంత్ నీల్ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చే మూవీ కేజీఎఫ్ ను మించే విధంగా ఉండబోతుందని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: