వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. సాధారణంగా చంద్రబాబు అంటేనే మండిపడే అంబటి.. రైతుల సమస్యలపై చర్చించే సమయంలో మరింత రెచ్చిపోయారు. చంద్రబాబు రైతు వ్యతిరేక ధోరణిని ఎండగట్టారు.


చంద్రబాబు ప్రభుత్వం రైతుల బట్టలన్నీ లాక్కుని గోచి మిగిల్చిందని అబంటి కామెంట్ చేశారు. ఇప్పుడు మేము గోచీ మిగిల్చామని ఘనంగా చెప్పుకుంటున్నారని సెటైర్లు పేల్చారు అంబటి. రాంబాబు ప్రసంగించే సమయంలో చంద్రబాబు డౌన్ డౌన్ అని వైసీపీ నాయకులు నినాదాలు చేశారు


దీనిపై స్పందించిన అంబటి రాంబాబు.. చంద్రబాబు డౌన్ డౌన్ అని నినాదాలు అవసరం లేదని అన్నారు. జనమే ఆయనను డౌన్ చేశారని, ఇంతకన్నా డౌన్ అయ్యేది లేదని అంబటి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు రైతు వ్యతిరేక ధోరణి మానుకుని.. ప్రభుత్వానికి సహకరించాలని అంబటి విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: