చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిని సంగతి తెలిసిందే. సీఎం జగన్‌ దీనిపై ఓ కమిటీని నియమించారు. అయితే పీపీఏల పునఃసమీక్షపై మరోసారి ఆలోచించాలని ఏపీ ప్రధాన కార్యదర్శికి  కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఇప్పటికే లేఖ రాశారు. తాజాగా కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్‌ కూడా లేఖ రాసారు. 


ఎపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశముందని మంత్రి సూచించారు. భారత్‌లోని సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ఆర్‌కే సింగ్‌ తెలిపారు. దేశంలో సౌర, పవన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఆటంకం కలిగితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదముందని, చట్టానికి లోబడి అన్ని అంశాలను  పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు.

కేంద్ర సహాయ మంత్రే స్వయంగా లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వం పీపీఏలపై పునరాలోచించే అవకాశం ఉందేమో చూడాలి. ఇది ఇలా ఉండగా మోడీ ప్రభుత్వం ఇంకా చంద్రబాబుని కాపాడుతుందా? అని కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానుల అనుమానం. 


మరింత సమాచారం తెలుసుకోండి: