దివంగతనేత రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించేవారు. అసెంబ్లీలో కూడా రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు నవ్వుతు కనిపించేవారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో అసహనం వ్యక్తం చేసేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు ఆయన ఒక్కోసారి నవ్వుకునేవారు. వారి ఆరోపణలు అర్థరహితం అనే విషయాన్ని వైఎస్ తన నవ్వుతోనే సమాధానం ఇచ్చేవారు.


అయితే ఆ నవ్వును అప్పుడు చంద్రబాబు నాయుడు సహించలేకపోయేవారు. ఆ విషయంలో స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడేవారు. 'ఆయన నవ్వుతున్నారు అధ్యక్ష..' అంటూ చంద్రబాబు నాయుడు స్పీకర్ కు కంప్లైంట్ ఇచ్చేవాళ్లు, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు మొహమంతా చాలా సీరియస్ గా పెట్టేవారు. ఇక వైఎస్ విషయంలోనే కాదు ఆయన తనయుడి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే కంప్లైంట్ చేశారు. సీఎం స్థానంలో ఇప్పుడు వైఎస్ తనయుడు కూర్చున్నారు.


ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఆ పార్టీ చేసే ఆరోపణలకు, చేసే వాదనలకు జగన్ కూడా నవ్వుతూ స్పందిస్తున్నారు. ఇంకేముంది.. చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలే! జగన్ మీద చంద్రబాబు నాయుడు మళ్లీ పాత మాటలే మాట్లాడుతున్నారు. 'నవ్వుతున్నారు అధ్యక్ష.. ఎందుకు నవ్వుతున్నారో..' అంటూ చంద్రబాబు నాయుడు మొహమంతా అదోలా పెట్టి వాపోతున్నారు. మొత్తానికి అప్పుడు వైఎస్ నవ్వునూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో భరించలేకపోయారు. ఇప్పుడు జగన్ నవ్వునూ సహించలేకపోతున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: