ఆర్టీసీ పై ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉందని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడ లోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్ లో రవీందర్ నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ, గతంలో టిడిపి ప్రభుత్వం బడ్జెట్ లో ఎన్నడూ ఆర్టీసీ కి ఈ స్థాయి లో కేటాయించలేదని తెలిపారు. 


ఆర్టీసీ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా కేటాయింపులు జరిగాయని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల కార్మికులు ఉద్యోగులు ఆనందం వ్యక్తం జేస్తున్నారు.

చంద్రబాబు గారి పాలనలో ఆర్టీసీనే దివాలా తీయించారని ఆరోపించారు. పదిహేను వందల డెబ్బై రెండు కోట్ల నిధిని ఆర్టీసీకి కేటాయించడం వల్ల, ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుందనే రవీంద్రనాథ్ రెడ్డి గారు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: