అదేంటో ఏపీలో గెలిచింది వైసీపీ, ఓడింది టీడీపీ, కానీ మధ్యలో బీజేపీ హడావుడి ఎక్కువైపోయింది. చెప్పాలంటే నోటా కంటే ఓట్లు తక్కువగా వచ్చిన పార్టీ, ఏపీ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ, సొంతంగా పోటీ చేస్తే ఒక్కరు కూడా డిపాజిట్ తెచ్చుకోలేని పార్టీ ఫార్టీ యియర్శ్ ఇండస్ట్రీ టీడీపీని బెదిరించేస్తోంది.


మేము గేట్లు తెర్చేశాం, ఢిల్లీ నుంచి గ్రీ సిగ్నల్ వస్తే చాలు, పోలోమంటూ టీడీపీ వాళ్ళు మొత్తం మాతో కలసిపోతారు. బాబు తప్ప ఎవరూ మిగలరు అంటారు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఇక మరోకాయన, సునీల్ ధియోధర్ అయితే టీడీపీ పని అయిపోయిందని చెప్పేస్తారు. టీడీపీని బాబు నడపలేరని, ఆయన జైలుకే వెళ్తారని జోస్యం చెబుతారు.


ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నాలక్ష్మీ నారాయణ అయితే రేపు మా పార్టీ పెద్దలు వస్తున్నారు. వారి సమక్షంలో ఎంతమంది టీడీపీ నాయకులు చేరుతారో మీరే చూసుకోండంటూ మీడియాతో చెబుతున్నారు. మరి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియక ఇపుడు చంద్రబాబు తల్లడిల్లాల్సిన పరిస్థితి.


ఆ మాటకు వస్తే ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నారు కమలనాధులు, గత నెలన్నరగా బీజేపీ టార్చర్ టీడీపీకి ఎక్కువైపోయింది. అవును కన్నా అన్నట్లుగా ఎంతమంది టీడీపీ నుంచి జారిపోతున్నారు...బాబుకు ఇదే ఇపుడు పట్టుకున్న బెంగ...


మరింత సమాచారం తెలుసుకోండి: