తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎందుర్కొంటోంది. ఆ పార్టీని బతికించుకోవడం ఇపుడున్న బాబు తరం కాదని తేలిపోతోంది. ఎందుకంటే బాబు గ్రామర్ కి కాలం చెల్లింది. గ్లామర్ ఫేస్  టీడీపీకి ఎటూ లేదు, ఇక ఔట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తారని బాబుకు చెడ్డ పేరు ఎలాగూ ఉంది. దాంతో పార్టీకి రాం రాం అనేసి నేతలంతా వెళ్ళిపోతున్నారు.


ఈ నేపధ్యంలో  టీడీపీని మళ్ళీ జనంలో ఉంచాలనుకుంటే బాలయ్యకు పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందట. పార్టీలో బాలయ్య కోసం వాదించే వారు వాయిస్ బాగా పెరుగుతోందట. బాలయ్య బలమైన నాయకుడని, ఆయన తండ్రి ఎన్టీయార్ చరిస్మా కొంతవరకైనా ఉందని, ఇక జనాల్లో కూడా నందమూరి వంశానికి న్యాయం జరిగిందని భావించాలంటే బాలయ్యకు ఇవ్వడమే కరెక్ట్ అని అంటున్నారుట.


జగన్ వేవ్ ఎంత బలంగా ఉన్నా బాలయ్య హిందూపురం నుంచి గెలవడం, అదే సమయంలో బాబు కొడుకు లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చినా ఆయన మంగళగిరిలో ఓటమి పాలు కావడాన్ని గుర్తు చేస్తున్నారుట. ఈ నేపధ్యంలో బాలయ్య సమర్ధుడైన నేతగా ఉంటారని, ఆయన్ని ముందు పెట్టి పార్టీ బండి లాగించాలని బాబుకు హితబోధ చేస్తున్నారుట. చూడాలి మరి చంద్రబాబు రాజనీతి ఎలా ఉంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: