టీడీపీ ఎంపీ కేశినేని నానీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఆసక్తికర పోస్టు చేశారు.” నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేనివాడు. Tweet చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈపోస్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరిని ఉద్దేశించి కేశినేని నాని ఈ పోస్ట్ చేసినట్టు.. అంటూ గుసగుసలు మొదలయ్యాయి.

 

నానీపోస్టు చూసిన వారు మాత్రం ”ఏంటి..నానీ! మీ లోకేశ్ ను ఉద్దేశించి ఒక్కసారిగా ఇలా రాస్తున్నావు, ఎందుకు ఇలా బరస్ట్ అయ్యావు” అంటూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. నానీ వ్యాఖ్యలు నారా లోకేశ్ నుఉద్దేశించేనని నెటిజన్లు కోడైకూస్తున్నారు. ఎంపీగా టీడీపీ నుంచి ఎన్నికైన నాని కొంతకాలంగా తన ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా పలు రకాల కామెంట్లు చేస్తున్నాడు. ఆమధ్య వీటిపై టీడీపీ అధినేత సైతం కలవరం చెందేలా సొంతపార్టీ వారిపైనే నానీ చేసిన కామెంట్లు హైలైట్ అయ్యాయి. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా చేసిన మెంట్ మాత్రం తీవ్రంగా ఉంది. వైసీపీలో ఈవ్యాఖ్యలకు తగ్గవారెవరూలేరు. అందరికీ ఈవ్యాఖ్యలకు నారా లోకేశ్ మాత్రమే కనిపిస్తున్నాడు.

 

ఎందుకంటే ఈమధ్య లోకేశ్ ట్విట్టర్ యుద్ధం మొదలెట్టాడు. ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లోపోస్ట్ చేస్తున్నాడు. వైసీపీ నాయకులైతే బహిరంగంగానే లోకేశ్ చేస్తున్నట్వీట్లపై.. లోకేశే రాస్తున్నాడా.. వేరేవారితోరాయిస్తున్నాడా.. ఎందుకంటేమాట్లాడితే తప్పులువస్తున్నాయని ట్వీట్ చేయిస్తున్నాడేమోనని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ వ్యాఖ్యలకు ఇప్పుడు కేశినేనినాని వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి. మరి.. దీనిపై క్లారిటీ నానీనే ఇవ్వాలి. లేదా యధాపలంగా.. లోకేశ్ ను ద్దేశించి అనలేదు.. నా ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారు అంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: