తాను ముఖ్యమంత్రి కావడానికి ఉడతా భక్తిగా సాయం చేసిన వారందరి రుణాన్ని తీర్చుకోవడాని జగన్ రెడీ అయ్యారు. ప్రభుత్వ పదవులు, కీలకమైన నామినేటెడ్ పదవులు జగన్ పందేరం చేస్తున్నారు. మొదటి తాంబూలం థర్టీ యియర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీకి దక్కింది.


ఇపుడు ఆ వరసలో మరో నటుడు ఆలీ చేరారని తెలుస్తోని. ఆలీకి చట్ట సభల్లో ప్రవేశించాలని కోరిక. అందువల్ల ఆలీని ఎమ్మెల్సీ చేస్తారని భావిస్తున్నారు. జగన్ సైతం ఆలీ అంటే బాగా ఇష్టపడతారు. ఆయన్ని తన మంత్రి వర్గంలో భవిష్యత్తులో తీసుకునే విధంగా ఎమ్మెల్సీని చేయవచ్చు అని వినిపిస్తోంది. అలాగే ఆలీకి కీలకమైన నామినేటెడ్ పదవి కూడా జగన్ ఇస్తారని అంటున్నారు.


ఇదిలా ఉండగా టాలీవుడ్లో వైసీపీ బ్యాచ్ గా ముద్ర పడిన మోహన్ బాబు, జయసుధ, రాజశేఖర్ దంపతులకు కూడా జగన్ పదవులు ఇవ్వాలనుకుంటున్నారుట. తొందర‌లోనే వీరికి కీలకమైన పదవులు అప్పచెప్పడం ద్వారా తాను అందరి వాడిని అని గట్టిగా చెప్పాలనుకుంటున్నారుట. దీంతో టాలీవుడ్లో బిగ్ షాట్స్ షాక్ తింటున్నారుట. తాము జగన్ కి వైసీపీకి దూరంగా ఉండి తప్పు చేశామన్న భావన వారిలో కనిపిస్తోందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: