-సుజనాకు అఖండ స్వాగతం పలికేందుకు సిద్దమైన బీజేపీ నేతలు..

- పార్టీ నాయకులతో పాటు సన్నిహితులతో ఆత్మీయ సమావేశం...

మాజీ కేంద్ర మంత్రి , రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీ లో చేరిన తర్వాత తొలి సారిగా ఏపీ కు వస్తున్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గాన కార్లు, బైక్ లతో భారీ ర్యాలీ కి బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేశారు. వెటర్నరీ కాలనీలోని వెన్యూ కన్వెన్షన్ హాలులో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సుజనా చౌదరి తో పాటు బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యవహారాల కో ఇన్ చార్జి  సునీల్ దేవధర్ , ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, మాజీ మంత్రి మాణిక్యాలరావు, విష్ణు కుమార్ రాజు లతో పాటు జిల్లా, నగర నాయకులు, రాష్ట్ర  నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

2014, 2019 టీడీపీ  ఎన్నికల ప్రణాళికలో కీలక భూమిక పోషించిన సుజనా చౌదరి కి నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. కొంతమంది టీడీపీ నాయకులు సైతం ఆయనను కలిసే అవకాశాలున్నాయి.  సుజనా రాక సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ వరకు భారీ హోర్డింగ్స్ ను, ఫ్లెక్సీలను పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం గుంటూరు లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు పదాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు  బయలు దేరి వెళ్తారు.

మద్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో పాటు అగ్రనేతలు ఆ గుంటూరు లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొంత మంది టీడీపీ సీనియర్ నేతలు సుజనా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. గుంటూరు కార్యక్రమానంతరం  విజయవాడ మురళీ ఫార్చూన్ హోటల్ లో జరిగే మీడియా సమావేశంలో మాట్లాడుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: