రేణూదేశాయ్ తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ఆమెను చాలాకాలం క్రితమే తెలుగు ప్రేక్షకులు తమలో ఒకరుగా భావిస్తూ వచ్చారు. ఆమె తన సొంత గడ్డ పూణేలో ఉంటున్నా కూడా తెలుగులో రేణూ ఫాలోయింగ్ వేరేగా ఉంది. ఆమె బుల్లి తెర మీద ఆ మధ్య‌న కనిపిస్తే ఆ షో కి మంచి రేటింగులే వచ్చాయి. ఇక రేణూ క్రేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు మళ్ళీ నటింపచేయాలని భావించారు.


అయితే రేణూ ఎందుకో నో అంటూ వచ్చింది. అప్పట్లో  ఆమెకు తిరిగి నటించడం ఇష్టం లేదన్న మాట వినిపించింది. అయితే ఆమె ఓ మరాఠీ మూవీ చేయడంతో మళ్ళీ సినిమాల్లోకి వస్తుందన్న ఆశ కలిగింది. ఇపుడు అదే నిజమవుతోంది. ఆమె తెలుగులో ఓ మూవీలో యాక్ట్ చేస్తున్న సంగతి రివీల్ అయింది.


టైగర్ నాగేశ్వరరావు పేరు మీద బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా  నటిస్తున్న ఈ మూవీలో రేణూ దేశాయ్ కీలకమైన పాత్రలో కనిపిస్తోందట. ఆ విషయన్ని ఈ మూవీకి మాటలు రాస్తున్న బుర్రా సాయి మాధవ్ చెప్పడంతో సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీలో రేణూ పాత్ర  చాలా బాగా ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి రేణూ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: