కొన్ని రోజుల నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వంత పార్టీ మీదనే విరుచుకుపడుతున్నారు. సంచలన ట్వీట్స్ తో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇక నాని తాజా ట్వీట్ చూస్తే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు లోకేష్ కు కూడా సూటిగా తగిలేలా ఉంది.  నాని చేసిన ట్వీట్ చూస్తే ‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు - నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు - నాలుగు వాక్యాలు రాయలేనివాడు - ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అంటూ ట్వీట్ పెట్టారు కేశినేని నాని.


ఈ ట్వీట్ చూస్తూ బుద్ధా వెంకన్నతో పాటు లోకేష్ ను ఉద్దేశించే పెట్టారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. నాలుగు పదాలు చదవలేని వాడు.. రాయలేని వాడు... నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు పదవులు పట్టేస్తున్నాడు అంటే ఈ పదాలన్ని కూడా అటు  లోకేష్ తో పాటు ఇటు వెంకన్నకూ వర్తించేలా ఉన్నాయి. లోకేష్ కు పదాలు పలకడం రాదన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు... అయినా ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకునే వేలాడుతున్నారు.ఇక బుద్ధా వెంకన్న కూడా ఓట్లు లేకపోయినా ఎమ్మెల్సీగా ఉన్నారు.


ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేని వ్యక్తి అని టీడీపీ వాళ్లే ఒప్పుకుంటారు. ఇక కేశినేనికి లోకేష్ పై పాత కోపం ఎలాగూ ఉంది. మరి ఇప్పుడు వెంకన్నతో కొత్త గొడవ ఏంటంటే విజయవాడ టీడీపీలో పెత్తనం చెలాయించేందుకు బుద్దా వెంకన్న ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేశినేని వెంకన్నను టార్గెట్ గా చేసుకునే ఈ ట్వీట్ పెట్టాడని టీడీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: