వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ఉదయం నుంచి చంద్రబాబు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నాడు. చంద్రబాబుని టార్గెట్ చేసి ఈ ట్విట్లను పెడుతున్నాడు విజయసాయి రెడ్డి. చంద్రబాబుపై వేసే కౌంటర్ ట్విట్లకు నెటిజన్లు రిట్విట్లు చేసి కొందరు ఫైర్ అవుతుంటే, కొందరు నిజమే అని కామెంట్లు పెడుతున్నారు. 


ఈరోజు ఉదయం నుంచి పెట్టిన ట్విట్లలో ఇలా రాశారు 'మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని జగన్ గారు చెప్పారు. శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా మీరు తెచ్చుకున్న పేరు అలాగే ఉంటుంది టెన్షన్ పడకండి. ఆ రికార్డు మీకే సొంతం. జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారి ప్రోగ్రెస్ ఉంటుంది. చూస్తారుగా తొందరెందుకు?'' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కు కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తూ స్టీల్ ప్లాంట్ అంటే పప్పర్ మెంట్ కాదు కాద, మన ఖజానా నుంచే డబ్బులు పెట్టాలి అని కామెంట్ పెట్టారు. మరి కొంతమంది వైఎస్ జగన్ కచ్చితంగా స్టీల్ ప్లాంట్ కడుతాడు రా ! అని కామెంట్లు పెట్టారు. అయితే ఉదయం నుంచి విజయసాయి రెడ్డి చేసిన కౌంటర్లకు చంద్రబాబు ఎలా రికౌంటర్ ఇస్తారు అనేది చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: